Wednesday, August 29, 2012

శ్రీ బాలపార్వతీ సమేత జలధీశ్వరాలయం


మన ఊరిలో తప్ప ప్రపంచం లో మరెక్కడా వినపడని కనపడని ఆలయం మన జలధీశ్వరాలయం.ఇటీవల కాలంలో బాలపార్వతీ సమేత జలధీశ్వరాలయం గా మరింత ప్రాచుర్యం లోనికి వచ్చింది.ఆగస్త్య మహాముని చేత ప్రతిష్టించబడిన ఈ ఆలయం మహిమాన్విత పుణ్యక్షేత్రం గా ప్రసిద్ధి చెందింది.ఇక్కడ స్వామి వారికి జలాభిషేకం చెయ్యరు.లింగం విభూది పూతతో తెల్లగా ఉంటుంది.ఈ గుడిలో జలధీశ్వరితో పాటు స్వామివారు ఒకే పానపట్టం పై వెలసి ఉన్నారు.

                                            శ్రీ బాలపార్వతీ  సమేత జలధీశ్వర  స్వామి
ఏకపీఠే విరాజంతం సర్వమంగళయా సహా '
    ఘంటసాల పురాధీశం జలధీశ్వర ఉపాస్మహే "
   భస్మాలంకృత సర్వాంగం అగస్త్యేన ప్రతిష్ఠితం '
భక్తాభీష్టప్రదం వందే అద్వైత జ్ఞాన సిద్ధయే "


      జలధీశ్వరాలయ   స్థలపురాణం 
            
పార్వతీదేవి కల్యాణం చుడటానికి సమస్త ప్రాణికోటి ఉత్తరాపధమునకు పొయినదిఉత్తరాపధము బరువు పెరిగి కృంగిపోతుంది.పరమేశ్వరుడు ఆగస్త్యమహాముని ని పిలిచి తక్షణమే దక్షిణపధంలో ఒక పుణ్యప్రదేశంలో ఏకపీఠంపై పార్వతీపరమేశ్వరులను ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో పూజిస్తే తన కళ్యాణ దర్శనభాగ్యం కలుగుతుందని సెలవిచ్చాడు.ఆగస్త్య మహాముని దక్షిణపధంలో ప్రతిష్టించిన క్షేత్రమే జలధీశ్వరాలయం.
పార్వతీ పరమేశ్వరులు ఏకపీఠంపై ఉన్న ప్రాచీన క్షేత్రం.దక్షిణ కైలాసంగా ఈ ఆలయాన్ని ప్రజలు భావిస్తారు.ఈ ఆలయ విమాన శిఖరం ఇతర ఆలయాలకు భిన్నంగా మూడు శిఖరాలతో గజపృష్టాకారం గా ఉంటుంది.జలధీశ్వరుడు భక్తసులభుడు.స్వామిభక్తుల కోర్కెలు తీర్చే భక్తసులభుడుగా వాసికెక్కాడు.స్వామివారి దేవాలయంలో ఇరవైఒక్క ప్రదక్షిణలు చేసి స్వామివారికి రుద్రాభిషేకం చేసినవారికి సత్వరమే కోరికలు నెరవేరతాయి.
                         ఆలయంలో ప్రతి సోమవారం విశేష రుద్రాభిషేకం,ప్రతిరోజూ ఉదయం అయ్యవారికి అభిషేకం,ప్రతిరోజూ సాయంత్రం అమ్మవారికి అష్టోత్తరనామార్చన,లలిత సహస్రనామ పారాయణం,ప్రతి శుక్రవారం అమ్మవారికి స్థపన,సహస్ర కుంకుమార్చన ,పౌర్ణమి రోజున శ్రీ సూక్తసహిత అమ్మవారికి స్థపన,సహస్ర కుంకుమార్చన,శుద్ధ చతుర్దశి రోజున మహాన్యాస పూర్వక ఏకవారభిషేకం,చతుర్వేద పారాయణం,ప్రతి సంవత్సరం మాఘశుద్ధపూర్ణిమ రోజున స్వామివారి జగాజ్యోతి ప్రజ్వలన మరియు వార్షిక కల్యాణం జరుపబడును.


భూమండలంలో ఎక్కడా లేని విధంగా ఏక పీఠం పై కొలువైన
శ్రీ బాలా పార్వతీ సమేత జలధీశ్వర స్వామి దేవస్థానం
ఘంటసాల - కృష్ణా జిల్లా

దూర ప్రాంతాల్లో ఉండే స్వామి వారి భక్తుల సౌకర్యార్ధం ఈ కింది సేవలను ఆన్ లైన్ ద్వారా కూడా అందుబాటులో ఉంచటం జరిగినది.కనుక ఈ సేవలను భక్తులు విశేషముగా ఉపయోగించుకుని స్వామి వారి సేవకు పాత్రులు కాగలరు.
ఓం
1) ప్రతి సోమవారం : మహా న్యాస పూర్వక ఏకవార అభిషేకం,మహా రుద్రాభిషేకం.
2) శుక్రవారం : శ్రీ సూక్త కుంకుమార్చన (అష్టోత్తరం)
3) ప్రతినెల మాస శివరాత్రి - మహన్యాస పూర్వక ఏకవార అభిషేకం,శ్రీ సూక్త కుంకుమార్చన (సహస్ర నామార్చన)   రాత్రివేళ - శాంతి కల్యాణం ,మాడ వీధులలో ఊరేగింపు.
4) మాఘ పౌర్ణమి : వార్షిక కల్యాణం 
మీ పేరు గోత్ర వివరాలను మరియు అభిషేకం చేయించవలసిన వారి వివరాలు మాకు మెయిల్ చేయండి.ప్రసాదం మరియు స్వామి వారి చిత్రపటం మీ అడ్రస్ కి కొరియర్ చేయబడతాయి.
మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ గొర్రెపాటి వెంకట రామకృష్ణ సెల్ : 99854 63899

ఇవే కాకుండా మీకు గల దోషాలకు చేయించవలసిన పరిహారాలు, శాంతి పూజలు, జపం చెయ్యాలన్నా పండితులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ పిశుపాటి నరసింహారావు గారు Cell: 9440226212 ఈ సేవలు పూర్తిగా ఉచితం.


No comments: